ఫతేపూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన గ్రామ సర్పంచ్.
ఆర్మూర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మైలారం రాము వెల్లడి..
ఫతేపూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన గ్రామ సర్పంచ్.
తెలంగాణ ఫోకస్ న్యూస్:భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫతేపూర్ గ్రామ సర్పంచ్ ఏనుగు ప్రణుక నాగరాజ్ మరియు జిల్లా బ్యాడ్మింటన్ అకాడమీ అధ్యక్షులు శ్రావణ్ రెడ్డి, ఆర్మూర్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మైలారం రాము,అన్ని పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వారసులు,కుల పెద్ద మనుషులు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.