తమ ఓటు హక్కును వినియోగించుకున్న.. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.
తమ ఓటు హక్కును వినియోగించుకున్న.. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ -మీ పొన్నాల) ఫిబ్రవరి11: ఎన్నికల సంఘం మార్గదర్శలను తు.చ తప్పకుండా పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ… ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేసిన ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులకు ఆదేశాల మేరకు నిబంధనలు పాటిస్తూ.. తమ ఓటు హక్కును ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తమ ఓటును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని 100% శాతం పోలింగ్ కు సహకరించాలని నియోజకవర్గ ప్రజలను, ఓటరు కోరారు. అలాగే ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా సిపి, ఆర్మూర్ సబ్ కలెక్టర్,ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ గౌడ్ సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.